ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్రాంచైజ్-ఆధారిత సూపర్క్రాస్ రేసింగ్ లీగ్ ఇండియన్ సూపర్క్రాస్ రేసింగ్ లీగ్ (ఐఎస్ఆర్ఎల్) రౌండ్-2 అధికారిక ఆతిథ్య నగరంగా హైదరాబాద్ను ప్రకటించింది. ఈ సందర్భంగా తెలంగాణ క్రీడలు & యువజన సేవల మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి అధికారిక పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రేసుల కోసం గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియాన్ని వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ ఎంపిక రాష్ట్రంలో మోటర్స్పోర్ట్స్ పై పెరుగుతున్న ఆసక్తి, ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువతకేంద్రీకృత క్రీడా కార్యక్రమాలపై ప్రభుత్వ కట్టుబాటును ప్రతిబింబిస్తోంది.
కార్యక్రమంలో ఐఎస్ఆర్ఎల్ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (సాట్స్) మధ్య ప్రతీకాత్మకంగా హెల్మెట్ మార్పిడి జరిగింది.
క్రీడా మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. “ప్రపంచస్థాయి వేదికలు, శిక్షణ అవకాశాలను సృష్టించడం ద్వారా యువతకు సాధికారత కల్పించడం తెలంగాణ లక్ష్యం. జీఎంసీ బాలయోగి స్టేడియం కలలు నిజమయ్యే వేదిక.
అథ్లెట్లు అన్ని క్రీడల్లో గ్లోబల్ స్థాయిలో పోటీకి సిద్ధం కావడానికి ఇది సహకరిస్తుంది. ఇలాంటి అంతర్జాతీయ స్థాయి లీగ్లకు తెలంగాణ తలుపులు తెరవడం ద్వారా మేము అవకాశాలను విస్తరిస్తున్నాం, ఉద్యోగాలను సృష్టిస్తున్నాం, పెట్టుబడులకు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని కల్పిస్తున్నాం” అన్నారు.
ఐఎస్ఆర్ఎల్ సహ వ్యవస్థాపకుడు ఈషాన్ లోఖండే మాట్లాడుతూ.. “ఐఎస్ఆర్ఎల్ ద్వారా మేము హైదరాబాద్ యువతకు అద్భుతమైన క్రీడా, వినోద అవకాశాలను తీసుకురావాలని సంకల్పించాం. తెలంగాణ ప్రభుత్వం మరియు సాట్స్ అందిస్తున్న మద్దతు, శక్తివంతమైన క్రీడా వ్యవస్థను నిర్మించాలనే రాష్ట్ర లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది” అన్నారు.
ఈ వేడుకలో మాజీ ఎంపీ మరియు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీ ఏ.పి. జితేందర్ రెడ్డి, సాట్స్ చైర్మన్ శ్రీ శివసేన రెడ్డి, సాట్స్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సోనిబాలా దేవి (ఐఎఫ్ఎస్), అలాగే తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఐటి, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, పరిశ్రమలు & వాణిజ్యం) శ్రీ జయేష్ రంజన్ (ఐఏఎస్) తదితరులు పాల్గొన్నారు.
Read Also :

