Ambani:భారత వ్యాపార రంగంలో ఎప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలతో దూసుకెళ్లే రిలయన్స్ గ్రూప్ ఇప్పుడు మరో రంగంలోకి అడుగు పెట్టింది. ఆయిల్ నుంచి రిటైల్ వరకు అన్ని విభాగాల్లో ఆధిపత్యం చాటుకున్న రిలయన్స్ రిటైల్ తాజాగా బాటిల్ వాటర్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. కాంపా బ్రాండ్ను పునరుద్ధరించిన రిలయన్స్ ఇప్పుడు దాని కింద “కాంపా ష్యూర్” పేరుతో తాగునీరు బాటిళ్లను మార్కెట్లోకి తెచ్చింది.
ప్రస్తుతం బాటిల్ వాటర్ రంగంలో బిస్లెరీ, ఆక్వాఫినా, కిన్లీ వంటి జెయింట్లు ఉన్నప్పటికీ, తక్కువ ధరలతో కాంపా ష్యూర్ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రిలయన్స్ పెద్ద మార్కెట్ షేర్ను కైవసం చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే FMCG రంగంలో కాంపా కోలా ద్వారా మళ్లీ మార్కెట్లో హడావుడి చేసిన రిలయన్స్, ఇప్పుడు నీటి బాటిల్ రంగాన్నీ తన కంట్రోల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తోంది.
భారతదేశంలో బాటిల్ వాటర్ మార్కెట్ విలువ వందల కోట్లలో ఉంది. పెరుగుతున్న అర్బన్ లైఫ్స్టైల్, ట్రావెలింగ్ అలవాట్లు, సేఫ్ డ్రింకింగ్ వాటర్ అవసరం ఈ రంగానికి మరింత వృద్ధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంబానీ తక్కువ ధర స్ట్రాటజీని ఉపయోగించడం వల్ల పోటీదారులకు గట్టి సవాల్ ఎదురవుతుంది.
కాంపా ష్యూర్ లాంచ్తో, రిలయన్స్ రిటైల్ కేవలం పానీయాల రంగానికే కాకుండా, ప్రతిరోజూ వాడే తాగునీటి మార్కెట్లోనూ బలమైన పట్టు సాధించబోతోందని నిపుణులు చెబుతున్నారు. “ఎవరి చేతిలోనైనా ఉన్న మార్కెట్, రిలయన్స్ ఎంట్రీతో కొత్త మలుపు తిరుగుతుంది” అని వ్యాపార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
అంటే ఇకపై వినియోగదారులకు తక్కువ ధరలో నాణ్యమైన నీరు అందుబాటులోకి రాబోతోంది. అంబానీ బాటిల్ వాటర్ మార్కెట్కి రావడం, భవిష్యత్లో మరోసారి పెద్ద డిస్రప్షన్కి నాంది కావొచ్చని భావిస్తున్నారు.
Read Also :

