SS Rajamouli : దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం తన అంబీషస్ ప్రాజెక్ట్ SSMB29 (గ్లోబ్ట్రాటర్) కోసం పని చేస్తున్నారు. ఈ భారీ చిత్రంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. నవంబర్లో టీజర్ విడుదల కానుందని రాజమౌళి ఇప్పటికే ధృవీకరించారు.

అయితే, 2025లో ‘బాహుబలి : ది బిగినింగ్’ విడుదలై 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, రాజమౌళి తాత్కాలికంగా తన కొత్త ప్రాజెక్ట్ను పక్కన పెట్టి బాహుబలి రీ-రిలీజ్పై దృష్టి పెట్టారు. అక్టోబర్ 31న రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా మళ్లీ థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు.
ఇటీవల లీకైన ఫోటోలు ప్రకారం, రాజమౌళి ఎడిట్ రూమ్లో కూర్చుని కొత్త ఎడిటింగ్ పనులు చేస్తున్నారు. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ సోషల్ మీడియాలో, “మేము ఏదైనా చేస్తే అది బెస్ట్గా ఇవ్వాలని ప్రయత్నిస్తాం. ‘ది ఎపిక్’ కోసం జట్టు కొత్త సినిమాలా కష్టపడుతోంది,” అని రాశారు.
ఈ నిర్ణయంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం, మహేష్ బాబు మూవీపై రాజమౌళి త్వరగా అప్డేట్ ఇవ్వాలని కోరుతున్నారు.
SSMB29 చిత్రంలోని కొన్ని భాగాలను ఇప్పటికే ఒడిశా, కెన్యాలో చిత్రీకరించారు. నవంబర్లో టీజర్ రానుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా నటించిన బాహుబలి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి. 2017లో వచ్చిన బాహుబలి 2 తర్వాత, రాజమౌళి రూపొందించిన RRR చిత్రం ఆస్కార్ అవార్డు గెలుచుకొని ఇండియన్ సినిమా ప్రతిష్టను ప్రపంచానికి చాటింది.
Read Also :.

