chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా రెండు భారీ ప్రాజెక్ట్లతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘మన శంకర వరప్రసాద్గారు’ (Mana ShankaraVaraPrasadGaru) చిత్రీకరణ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే కేరళలో కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా కొత్త షెడ్యూల్లోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 19 వరకు జరగనున్న ఈ షూటింగ్లో రెండు భారీ పాటల చిత్రీకరణ జరగనుందని టీమ్ ప్రకటించింది. ఈ పాటలు కొత్త రికార్డులను సృష్టించేలా ప్లాన్ చేసినట్లు పేర్కొంది.
చిరుతో పాటు మొత్తం టీమ్ ఉత్సాహంగా పనిచేస్తుండగా, అభిమానుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 5 నుంచి జరగనున్న తదుపరి షెడ్యూల్లో ఆయన భాగం కానున్నట్లు నిర్మాత సాహు గారపాటి వెల్లడించారు. ఇక ఈ మూవీని 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు.
‘మన శంకర వరప్రసాద్గారు’లో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, మరోవైపు వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న *‘విశ్వంభర’ (Vishwambhara)*లో చిరు సరసన త్రిష కనిపించనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తిగా భిన్నమైన జానర్లలో వస్తుండటంతో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ‘మన శంకర వరప్రసాద్గారు’లో కేవలం 5 శాతం మాత్రమే వీఎఫ్ఎక్స్ ఉపయోగిస్తుండగా, ‘విశ్వంభర’లో మాత్రం విస్తృతంగా వీఎఫ్ఎక్స్ ప్రాధాన్యతనివ్వబోతున్నారు.
అభిమానులకు వచ్చే ఏడాది చిరంజీవి డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారు. కొత్త ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి *‘మన శంకర వరప్రసాద్గారు’*తో, వేసవిలో *‘విశ్వంభర’*తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకోవడంతో ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మెగాస్టార్ రెండో ఇన్నింగ్స్లో ఇవి మైలురాళ్లుగా నిలుస్తాయన్న నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది.
Read Also : కుక్క కరిస్తే ఏం చేయాలి..?

