Tirupathi : ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో విచిత్రమైన సంఘటన జరిగింది. ఓ మహిళ చేసిన పనికి సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చింది. మానవసంబంధాలు ఎంత దెబ్బతింటున్నాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
ఏపీలోని తిరుపతి జిల్లా కేవీబీపురంలో ఈ దారుణ ఘటన జరిగింది. అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఏకంగా కన్నకూతురినే చంపేందుకు ప్రయత్నించింది ఓ మహిళ.
కేవీబీపురానికి చెందిన 15 ఏళ్ల బాలికకు 5 నెలల క్రితం 18 ఏళ్ల యువకుడితో వివాహం జరిగింది. అమ్మాయి మైనర్ అయినా కూడా పెండ్లి చేసింది ఆమె తల్లి.
ఆ తర్వాత అంతా కలిసే ఉంటున్నారు. అత్త కూడా కూతురు, అల్లుడితే కలిసే ఉంటోంది. ఆమెకు భర్తలేదు. దీంతో సొంత అల్లుడితోనే అక్రమ సంబంధం పెట్టుకుంది.
వీరిద్దరూ పెళ్లికి సిద్ధపడ్డారు. కూతురి ముందే.. అల్లుడితో తాళి కట్టించుకునేందుకు ఆ మహిళ ప్రయత్నించింది. దీంతో బాలిక అడ్డుకునే ప్రయత్నం చేసింది.
తమ సరసాలకు అడ్డుగా ఉందని కన్నకూతురిపై రోకలిబండతో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించింది.
అత్తకు అల్లుడు కూడా సహకరించాడు. ఇద్దరు కలిసి రోకలిబండతో బాలికపై దాడి చేశారు.
దీంతో ఆ అమ్మాయి పెద్ద ఎత్తున కేకలు వేసింది. బయటకు పరుగులు తీసింది. చుట్టుపక్కల వారు వచ్చి బాలికను రక్షించి హాస్పిటల్ కు తరలించారు.
రోమాంటిక్ అత్తా, అల్లుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.
Read Also :.

