IPL : టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అశ్విన్.. తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.
అశ్విన్ తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. క్రికెట్లో తన ప్రయాణంలో అభిమానులు, సహచర ఆటగాళ్లు, కోచ్లు, కుటుంబసభ్యులు అందించిన సహకారం కోసం ధన్యవాదాలు తెలిపాడు.
2010లో ఐపీఎల్లో అడుగుపెట్టిన అశ్విన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో మంచి ప్రదర్శన కనబరిచాడు.
అనంతరం పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ రాయల్స్ తరఫున కూడా ఆడాడు. 15 ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో అశ్విన్ 190కి పైగా మ్యాచ్లు ఆడి, 170కు పైగా వికెట్లు పడగొట్టాడు.
అశ్విన్ రిటైర్మెంట్తో ఐపీఎల్లో మరో స్టార్ స్పిన్నర్ ఆడకపోవడం అభిమానులను కలిచివేసింది.

