IIM Raipur : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) రాయ్పూర్ తన ప్రతిష్ఠాత్మక ‘లీడర్షిప్ సమ్మిట్ 2025’ను విజయవంతంగా నిర్వహించింది.
ఈ సదస్సు థీమ్ – “ది సీఎక్స్ఓ కంపాస్: నావిగేటింగ్ బియాండ్ బౌండరీస్ టు బిల్డ్ ఫ్యూచర్ రెడీ ఆర్గనైజేషన్స్.”
ఈ రెండు రోజుల కార్యక్రమంలో సీఎక్స్ఓలు, పాలసీమేకర్లు, వ్యాపారవేత్తలు, మరియు ప్రముఖులు పాల్గొన్నారు. మొత్తం ఆరు ప్యానెల్ చర్చలు జరిగాయి. వాటిలో నాయకత్వంలోని పలు అంశాలను చర్చించారు.
ముఖ్య అతిథిగా టాటా హిటాచీ కన్స్ట్రక్షన్ మెషినరీ ఎండీ శ్రీ సందీప్ సింగ్ పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ – భవిష్యత్ సంస్థలకు ఇన్నోవేషన్, కస్టమర్-సెంట్రిసిటీ, సస్టెయినబిలిటీ ఎంతో అవసరమని చెప్పారు.
గౌరవ అతిథిగా పెప్సీకో ఇండియాకు (pepsico india)చెందిన శ్రీమతి దీపిక రాజోర్ (Deepika rajor)హాజరయ్యారు. ఆమె ‘పీపుల్-ఫస్ట్’ మరియు ఇంక్లూజివ్ లీడర్షిప్ శక్తిని వివరించారు.
ఐఐఎం రాయ్పూర్ (IIM Raipur) డైరెక్టర్-ఇన్-ఛార్జ్ ప్రొఫెసర్ సంజీవ్ ప్రషార్ మాట్లాడుతూ “నిజమైన నాయకత్వం అధికారం లేదా పదవికే పరిమితం కాదు. అది విజన్, అడాప్టబిలిటీ, మరియు ఒక లక్ష్యంపై ఆధారపడి ఉంటుంది” అన్నారు.
భవిష్యత్తు కోసం సిద్ధమయ్యే సంస్థలు టెక్నాలజీ, ఇన్నోవేషన్తో పాటు మానవ విలువలపైదృష్టి పెట్టాలని సూచించారు.
ఈ సమ్మిట్లో అనేక మంది ప్రముఖులు మాట్లాడారు. వారిలో శ్రీ కృష్ణ మిశ్రా (సీఈఓ, ఎఫ్పీఎస్బీ ఇండియా), శ్రీ ప్రంజల్ కామ్ర (ఫౌండర్, ఫినాలజీ), శ్రీ ఆశిష్ కపూర్ (హెడ్, మహీంద్రా టెకో) ఉన్నారు.
Read Also :

