తెలంగాణ జానపద గేయం బుల్లెట్టు బండి పాటకి డాన్స్ చేసి ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయింది మంచిర్యాలకి చెందిన నవవధువు సాయిశ్రియ. తన పెళ్లి బరాత్ లో చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది.
మీడియా కూడా వీరిని ఇంటర్వ్యూ చేయడంతో ఆమెకి ఎక్కడలేని పాపులారిటీని తీసుకొచ్చింది. అయితే ఇప్పుడామెకి బంపర్ ఆఫర్ వచ్చింది. ఆమె ఏ పాటకైతే డాన్స్ చేసి పాపులర్ అయిందో ఆ పాటని నిర్మించిన నిర్మాణ సంస్థ బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ తాము నిర్మించబోయే మరో పాటలో డాన్స్ చేసే అవకాశాన్ని కల్పించింది.
ఈ విషయాన్ని ఆ సంస్థ నిర్వాకులు వెల్లడించారు. అవకాశం రావడంతో సాయిశ్రియ కూడా ఎగిరి గంతేస్తుంది. త్వరలోనే ఈ కొత్త పాటలో సాయిశ్రియ కనిపించనుంది. ఇదిలావుండగా సాయిశ్రియ ప్రస్తుతం విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తుంది.
ఆమె భర్త అశోక్ జీహెచ్ఎంసీ పరిధిలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. మంచిర్యాలకి చెందిన సాయిశ్రియకి.. ఆకుల అశోక్ తో ఈ నెల 14న వివాహం జరిగింది.
కాగా ఈ బుల్లెట్టు బండి పాటను లక్ష్మణ్ రాయగా ఎస్కే బాజి సంగీతం అందించారు. సింగర్ మోహన భోగరాజు పాడారు. ఈ పాటను బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది.
Also Read :
- Khushbu Sundar : ఓ.. టూ లేట్.. మా ఆయన్ని అడిగి చెబుతా..!
- Actor kartikeya : వీళ్లిద్దరికి అక్కడ కుదిరిందట..! లక్కీ కార్తికేయ..
- దళితబంధు : హుజూరాబాద్కి మరో రూ. 500 కోట్లు.. !
- V6 Teenmaar : తీన్మార్ రాధ ఎందుకు కనిపించడం లేదు..? ఏమైంది..?
- వర్మలోని ‘కామాంధుడు’ మరోసారి నిద్రలేచాడు..!