Jagtial : ప్రాణాలు కాపాడాల్సిన డాక్డర్లు నిర్లక్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా జగిత్యాల(Jagtial ) జిల్లాలోని ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ల నిర్వాకం బయటపడింది. డాక్టర్ల నిర్లక్ష్యం వలన ఓ మహిళ గత 16 నెలలుగా నరకం చూసింది. ఇంతకు ఏం జరిగిదంటే.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన నవ్య శ్రీ అనే బాలింత గతేడాది ఆమె తల్లిగారి ఊరు అయిన జగిత్యాలలోని ఏరియా ఆసుపత్రిలో గతేడాది డిసెంబర్ లో చేరింది.
ఆమెకు సిజేరియన్ చేసిన వైద్యులు పొట్టలో కర్చీఫ్, కాటన్ గుడ్డ మరిచిపోయారు. అప్పటినుంచి నవ్య శ్రీ కడుపు నొప్పితో బాధపడుతూ వచ్చింది. సంవత్సరాలు గడుస్తున్న కొద్ది బాధ ఎక్కువ కావడంతో భరించలేని స్థితిలో వేములవాడలోని పెద్ద ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఆక్కడ ఆమెకు స్కానింగ్ చేయగా నవ్య శ్రీ పొట్టలో కర్చీఫ్, కాటన్ గుడ్డలా ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. ఈ విషయం తెలియడంతో ఆమె కుటంబ సభ్యులు ఒక్కసారిగా కంగుతిన్నారు.
ఇదే విషయంపై తనకు ఆపరేషన్ చేసిన డాక్టర్లను అడుగుదామని వెళ్తే అక్కడ అసలు డాక్టర్లే లేరు. దీంతో కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే జగిత్యాల మాత శిశు, ఏరియా ఆసుపత్రుల్లో డాక్టర్ల నిర్లక్ష్యంతో ఆరుగురు గర్భిణీ స్త్రీలు,చిన్నారులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నవ్య శ్రీ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read :