Nalgonda : నల్గొండ(Nalgonda)లోని ఓ చర్చిలో పియానో వాయించే విలియమ్సన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. దాదాపు డజను మందికిపైగా మహిళలను లోబర్చుకుని మోసం చేశాడని ఆరోపిస్తున్నారు బాధితులు. విలియమ్సన్ పై ఇద్దరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటాని చెప్పి సహజీవనం చేసి వదిలేశాడని ఓ మహిళ నల్గొండ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కొద్ది రోజుల కిందటే మరో మహిళ మునుగోడు పోలీసులను ఆశ్రయించింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. చర్చికి వచ్చే మహిళలు, యువతులను లోబర్చుకుని విలియమ్సన్ మోసం చేస్తున్నాడని… దాదాపు డజన్ మందికిపైగా మహిళలు విలియమ్సన్ చేతిలో మోసపోయారని పోలీసులకు తెలిపింది.
విలియమ్సన్ పై మహిళల ఫిర్యాదుతో నల్గొండ పోలీసులు విచారణ మొదలు పెట్టారు. విలియమ్సన్ ను పిలిపించి ప్రశ్నించారు. విచారణ సమయంలో విలియమ్సన్ కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో అతన్ని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు పోలీసులు. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్న విలియమ్సన్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read :
- KCR Press Meet : మెడలు వంచుతా అన్నోనికి మెడ మీద తలకాయ లేదని అర్ధమైంది..!
- CHINA BORDER : చైనా బార్డర్ లో ఎగరలేనమ్మ.. కశ్మీర్ ల ఏమో చేసిందట.!
- KCR Mark Dialogues : మంది మాటలు వట్టుకుని మార్వానం బోతే…!
- KCR : బండి సంజయ్ని బజారున నిలవేట్టిన కేసీఆర్..!
- Jai Bhim : ‘జై భీమ్’లో సినతల్లిగా నటించిన ఆ పిల్ల ఎవరు… ?
- Amrutha Pranay : పింక్ డ్రెస్లో మెరిసిపోతున్న అమృత ప్రణయ్.. దీపావళి స్పెషల్ సాంగ్..!